BJP | యూపీ బీజేపీలో ముదిరిన విభేదాలు.. యోగి సమావేశాలకు డిప్యూటీ సీఎంల డుమ్మా

BJP | లక్నో, జూలై 26: ఉత్తరప్రదేశ్‌ బీజేపీలో అంతర్గత విభేదాలు ముదురుతున్నాయి. ఆధిపత్య పోరు తీవ్రమవుతున్నది. సీఎం యోగి ఆదిత్యనాథ్‌, డిప్యూటీ సీఎంల మధ్య వైరం పెరుగుతున్నది. ఇటీవల సీఎం ఆదిత్యనాథ్‌ పార్టీ కేడర్‌తో వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు. అయితే ఈ సమావేశాలకు ఉప ముఖ్యమంత్రులు కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య, బ్రిజేష్‌ పాఠక్‌ గైర్హా జరవుతుండటంతో పలు సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఈ నెల 24న మొరాదాబాద్‌, బరేలీ డివిజన్‌ ఎమ్మెల్యేలతో సీఎం యోగి నిర్వహించిన సమావేశానికి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య గైర్హాజరు కాగా, 25న జరిగిన మీరట్‌, ప్రయాగ్‌రాజ్‌ డివిజన్‌ ఎమ్మెల్యేల సమావేశానికి బ్రిజేష్‌ హాజరు కాలేదు. దీంతో యూపీ బీజేపీలో విభేదాలు పెద్దయెత్తున కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.

2024-07-26T19:54:03Z dg43tfdfdgfd