కల్తీ చేస్తే తాట తీస్తాం.. హోటల్స్‌కు తెలంగాణ సర్కార్ స్ట్రాంగ్ వార్నింగ్..

రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖల మంత్రి దామోదర్ రాజనర్సింహ హైదరాబాదులోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం - కమిషనర్ ఫుడ్ సేఫ్టీ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు.   ఈ సమావేశంలో రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మాట్లాడారు. ఆహార కల్తీ చేసే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. నాణ్యమైన ఆహారాన్ని ప్రజలకు అందించాలని.. హైదరాబాద్ బిర్యాని కి అంతర్జాతీయంగా గుర్తింపు ఉంది.

హైదరాబాద్ ను మెడికల్ టూరిజం హబ్ గా తీర్చిదిద్దుతున్నామన్నారు. ఫుడ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా గా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్నామన్నారు. హోటల్ ల యజమానులు సామాజిక బాధ్యతతో వ్యవహరించాలని పేర్కొన్నారు. ప్రతి 6నెలలకు ఒకసారి వర్క్ షాప్ ల నిర్వహణ తో పాటు అవగాహన సదస్సులను నిర్వహిస్తామని తెలిపారు. కల్తీ చేసే హోటళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి హెచ్చరించారు.

---- Polls module would be displayed here ----

ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ విధిగా తనిఖీలు చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో హోటల్స్ యజమానులు చేసిన పలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించారు. ఈ సమావేశంలో తెలంగాణ స్టేట్ హోటల్స్ అసోసియేషన్, నేషనల్ రెస్టారెంట్స్ అసోసియేషన్, ఆయిల్ మర్చంట్ అసోసియేషన్, బార్ అండ్ రెస్టారెంట్స్, ఇండియన్ డైలీ మిల్క్ ప్రొడక్ట్స్ అసోసియేషన్, తెలంగాణ ప్యాకేజెడ్ డ్రింకింగ్ వాటర్ అసోసియేషన్, తెలంగాణ రోలర్ ఫ్లోర్ మిలర్స్ , బేకరీ అండ్ ఐస్ క్రీమ్స్ అసోసియేషన్ లు పాల్గొన్నారు.

2024-06-11T10:57:55Z dg43tfdfdgfd