ఆంధ్రప్రదేశ్

Trending:


తిరుమలలో తీవ్ర విషాదం.. శ్రీవారి దర్శన క్యూలైన్ కాంప్లెక్స్‌లో భక్తురాలు మృతి

Tirumala Devotees Died Of Heart Attack: తిరుమలలో విషాదం చోటు చేసుకుంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో గుండెపోటుతో భక్తురాలు మృతి చెందారు. శనివారం తెల్లవారుజామున వైకుంఠ క్యూ క్లాంపెక్స్ లో క్యూలైన్ లో వెళ్తుండగా ఝాన్సీ అనే భక్తురాలు ఒక్కసారిగా కుప్పకూలారు. వెంటనే భక్తులు, సిబ్బంది అప్రమత్తమై సీపీఆర్ చేసి రుయా ఆస్పత్రికి తరలించే ప్రయత్నించారు.. కానీ అప్పటికే ఆమె చనిపోయారు. ఝాన్సీది కడపజిల్లా కాగా.. లండన్‌లో స్థిరపడ్డారు. ఈ ఘటన తీవ్ర...


సెలవుల్లేకుండా 104 రోజుల డ్యూటీ - చనిపోయిన ఉద్యోగి - చైనాలో ఇలాంటివి మామూలేనా ?

China Man dies of organ failure after working for 104 days : చైనాలో వర్క్ ఫోర్స్ చాలా చీప్ గా వస్తుందని అక్కడ పెద్ద పెద్ద కంపెనీలు తమ ఫ్యాక్టరీలను పెడుతూ ఉంటాయి. లేబర్ చట్టాలు కూడా అంత కఠినంగా ఉండవు. అందుకే చైనా తయారీ రంగానికి కేంద్రంగా మారింది. కానీ మరి ఆ పరిశ్రమల్లో పని చేసే వారి పరిస్థితి ఏమిటి ?. ఎలా చచ్చిపోయినా బయటకు తెలియదు. కానీ ఇటీవల కొన్ని ఘటనలు వెలుగు చూస్తున్నాయి. అవన్నీ ఇంత ఘోరమా అనిపించేలా ఉంటున్నాయి. తాజాగా ఓ కంపెనీలో పని చేస్తున్న...


AP Floods Damage: ఆంధ్రప్రదేశ్‌కు కోలుకోలేని దెబ్బ.. వరదలతో రూ.6,880 కోట్ల నష్టం

Andhra Pradesh Enumerates Flood Damage Cost Of Rs 68880 Cr To Union Govt: భారీ వర్షాలు సృష్టించిన వరదలతో ఆంధ్రప్రదేశ్‌కు భారీ నష్టం సంభవించింది. వరద ధాటికి ఏపీ దాదాపు రూ.7 వేల వరకు నష్టం ఏర్పడింది.


వినాయకచవితి సందడి

వినాయకచవితి సందడి వెలుగు , కరీంనగర్: నవరాత్రి పూజలు అందుకునేందుకు గణనాథుడు సిద్ధమయ్యాడు. వినాయక చవితి సందర్భంగా కరీంనగర్ లోని టవర్ సర్కిల్‌‌‌‌‌‌‌‌లో కొనుగోళ్ల సందడి నెలకొంది. విగ్రహాలతోపాటు పూజా సామగ్రి కొనుగోలు చేసేందుకు వచ్చినవారితో ఆ ప్రాంతమంతా కిటకిటలాడింది. ©️ VIL Media Pvt Ltd.


khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడికి సీఎం రేవంత్‌ రెడ్డి తొలిపూజ.. భారీగా తరలివచ్చిన భక్తులు

khairatabad ganesh 2024 : ఖైరతాబాద్‌ గణేశుడి మండపం వద్ద సందడి నెలకొంది. ఈసారి సప్తముఖ మహాశక్తి గణపతిగా ఖైరతాబాద్ గణేశుడు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఖైరతాబాద్‌ గణేశుడికి తొలిపూజ కార్యక్రమం నిర్వహించారు. అటు భక్తులు పెద్దఎత్తున తరలి వచ్చారు.


Budameru: బుడమేరు అసలు పేరేంటి? విజయవాడ వరదలకు కారణం ఏంటో తెలుసా?

Budameru: బుడమేరు అనేది ఒక చిన్న ఏరు.. ఇది నది కాదు. దీనికి బెజవాడ దుఃఖదాయిని అనే మరో పేరు కూడా ఉంది. మైలవరం కొండల్లో ఉద్భవించి, బెజవాడ మీదుగా కొల్లేరులో కలిసే ఈ ఏరు, పుట్టిన స్థలానికి, బెజవాడకు మధ్య దూరం కేవలం నలభై కిలోమీటర్ల కంటే తక్కువగా ఉంటుంది. ఇంత చిన్న ఏరు, ఇంత తక్కువ దూరం మాత్రమే ప్రయాణించే ఏరు బెజవాడని ఎలా బెంబేలు ఎత్తిందో తెలుసుకుందామా?బుడమేరు వరదలకు ప్రధాన కారకులు పాలకులు, ప్రజల నిర్లక్ష్యం. ఏరు ప్రవాహ మార్గాన్ని వీరు సంవత్సరాల తరబడి...


భారత్‌కు వచ్చే విదేశీ పెట్టుబడుల్లో సగం మహారాష్ట్రకే - తెలంగాణకూ పర్వాలేదు.. కానీ ఏపీకే !

Maharashtra tops India FDI second time in a row : తమ రాష్ట్రానికి పెట్టుబడులు ఆకర్షించాలని ప్రతి రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటూనే ఉంటుంది. పెట్టబడిదారులు కూడా పారిశ్రామికంగా అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లోనే పెట్టుబడులు పెడుతూంటారు. ముఖ్యంగా విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వస్తే తమ ప్రాంతాలు అభివృద్ది చెందుతాయని నమ్మకంతో ఉంటారు. ఈ ఆర్థికత సంవత్సరంలో జూన్ వరకు వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను మహారాష్ట్ర ప్రభుత్వం ఎక్కువగా ఆకర్షించింది. వరద నీళ్లలో కారు...


Traffic Restrictions | వినాయక చవితి.. హైదరాబాద్‌లో నేటి నుంచి 10 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

వినాయకచవితి ఉత్సవాలకు (Ganesh Festival) సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో గణనాథులు మండపాల్లోకి చేరుకోనున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు (Traffic Restrictions) విధించారు.


ఖైరతాబాద్ బడాగణపతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు

ఖైరతాబాద్ బడాగణపతి పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు హైదరాబాద్ సిటీలో గణేస్ చతుర్థి పురస్కరించుకొని గల్లీగల్ళీకో గణేషులు కొలువు దీరారు. హైదరాబాద్ ఫేమస్ గణేషుడు ఖైరతాబాద్ బడాగణపతికి తొలిపూజ నిర్వ హించారు నిర్వాహకులు.తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ బడా గణేషుని దర్శించుకున్నారు. ఖైరతాబాద్ బడా గణేషుని దర్శించుకునేందుకు సిటీతో పాటు వివిధ ప్రాంతాలనుంచి భక్తులు...


Nellore News: విజయవాడ వరద బాధితులకు నెల్లూరోళ్ల చిరు సాయం

Andhra Pradesh: విజయవాడని వరదలు చుట్టుముట్టాయి. బెజవాడ విలయానికి ఏపీలోని ఇతర ప్రాంతాలు కూడా కంటతడి పెట్టాయి. తమకు తోచినంత సాయం చేయడానికి అన్ని ప్రాంతాల వారు ముందుకొచ్చారు. కేవలం ఆర్థిక సాయమే కాదు, నేరుగా అక్కడికి వెళ్లి బాధితులకు అండగా నిలబడేందుకు కూడా అన్ని ప్రాంతాలనుంచి స్వచ్ఛందంగా కొంతమంది కదలి వచ్చారు. నెల్లూరు జిల్లానుంచి కూడా ఇలాంటి ప్రయత్నం జరిగింది. విరాళాలివ్వడంలో, బాధితుల్ని ఆదుకోవడంలో నెల్లూరు నేతలు, అధికారులు, ప్రజలు ఓ అడుగు...


సూరారంలో 25 అడుగుల మట్టి గణపతి

సూరారంలో 25 అడుగుల మట్టి గణపతి కుత్బుల్లాపూర్ ​నియోజకవర్గం సూరారం భవానీనగర్​లో శ్రీవినాయక యువజన సంఘం ఆధ్వర్యంలో 25 అడుగుల మట్టి గణపతిని ఏర్పాటు చేశారు. 35 ఏండ్లుగా భవానీనగర్​లో గణేశ్​ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా 14 ఏండ్లుగా ఇక్కడ భారీ మట్టి వినాయకులను ప్రతిష్ఠిస్తున్నారు. 35వ వార్షికోత్సవం సందర్భంగా ఈసారి 25 అడుగుల్...


Weather Latest Update: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం, రేపటికి వాయుగుండంగా మార్పు - వాతావరణ శాఖ అలర్ట్

Weather Latest News: సెప్టెంబరు 7న హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మధ్య, పరిసర ఉత్తర బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడన ప్రాంతం ఉత్తర దిశగా కదులుతూ ఈరోజు ఉదయం 0830 గం.లకు వాయువ్య మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో ప్రస్పుటమైన అల్పపీడన ప్రాంతంగా ఏర్పడింది. దీని అనుబంధ ఆవర్తనం సగటు సముద్ర మట్టం నుండి 7.6 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించి ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి వున్నది. ఇది ఉత్తర దిశగా కదులుతూ బలపడి...


CM Chandrababu: 'గత ప్రభుత్వ పాపాన్ని కరెక్ట్ చేశాం' - బుడమేరును ఇష్టానుసారం కబ్జా చేశారని సీఎం చంద్రబాబు ఆగ్రహం, వర్షంలో వరద ప్రాంతాల్లో పర్యటన

CM Chandrababu Visit Flood Affected Areas In Vijayawada: గత ప్రభుత్వ పాపాన్ని ఈ రోజు కరెక్ట్ చేశామని.. ఐదేళ్లలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తిగా గాలికొదిలేసిన పాపం నేడు మనకు శాపంగా మారిందని సీఎం చంద్రబాబు (CM Chandrababu) ఆవేదన వ్యక్తం చేశారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆయన ఏడో రోజు పర్యటించారు. అనంతరం విజయవాడ (Vijayawada) కలెక్టరేట్‌ వద్ద మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ ఐదేళ్ల పాపాలు.. రాష్ట్ర ప్రజలకు శాపాలుగా మారాయని మండిపడ్డారు. అప్పటి వైసీపీ...


నటుడు మురళీమోహన్‌ ఆస్తులపై హైడ్రా ఫోకస్.. జయభేరీ సంస్థకు నోటీసులు

హైదరాబాద్‌లో హైడ్రా కూల్చివేతలు.. హడలెత్తిస్తోన్న విషయం తెలిసిందే. చెరువులు కుంటలను ఆక్రమించి అక్రమంగా నిర్మించిన కట్టడాలపైకి బుల్డోజర్లు ప్రయోగిస్తూ.. హైడ్రా ప్రకంపనలు సృష్టిస్తోంది. అయితే.. హైడ్రా పంపిస్తోన్న బుల్డోజర్లు.. ఏ రాజకీయ నేతల బెదిరింపులకు, సినీ ప్రముఖుల పాపులారిటీకి ఆగిపోవటం లేదు. ఇప్పటికే నాగార్జునకు సంబంధించిన ఎన్ కన్వెన్షన్‌ను కూల్చేసిన హైడ్రా.. ఇప్పుడు సీనియర్ నటుడు మురళీమోహన్‌కు చెందిన జయభేరీపై ఫోకస్ చేసింది.


Tirumala : తిరుమలలో మరిన్ని మార్పులు..! ఇకపై 'ఆధార్' ప్రామాణికంగా సేవలు - టీటీడీ తాజా నిర్ణయాలివే

తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది. భక్తులకు ఆధార్ ప్రామాణికంగా సేవలు అందించేందుకు సిద్ధమైంది. ఇందుకు ప్రాథమికంగా కేంద్రం నుంచి అనుమతి లభించిందని టీటీడీ ఈవో తెలిపారు. తిరుమలలో దళారీ వ్యవస్థకు చెక్ పెట్టడమే లక్ష్యంగా సంస్కరణలు తీసుకువస్తున్నట్లు పేర్కొన్నారు.


Gold: బంగారం ఎక్కడ, ఎలా పుట్టిందో తెలుసా? భూమిపైన అస్సలు కాదంట!!

బంగారం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఉండాలే కానీ వొళ్లంతా బంగారంతో నింపేసుకుంటారు. అయితే అసలు ఈ బంగారం భూమిపైకి ఎలా వచ్చిందో చాలా మందికి తెలియదు? అసలు బంగారం భూమిపైకి ఎలా వచ్చిందనే ప్రశ్న అందరిలోనూ ఉంటుంది. తాజాగా ఓ అధ్యయనం దీనిపై క్లారిటీ ఇచ్చింది. గతంలో వచ్చిన అధ్యయనాలను కాదని స్పష్టమైన ప్రకటన చేసింది. గత నివేదికలు ఏం చెబుతున్నాయంటే.. భూమి క్రస్ట్‌లో పగుళ్ల ద్వారా ప్రవహించే వేడి, ఖనిజాలు అధికంగా ఉండే ద్రవాల నుంచి ఏర్పడతాయని భావించారు. ఈ ద్రవాలు చల్లబడినప్పుడు.. బంగారం అవక్షేపించబడి చుట్టుపక్కల ఉన్న క్వార్ట్జ్‌లో పేరుకుపోతుందని తెలుపుతున్నాయి. అయితే ఇలా జరిగితే తక్కువ మొత్తంలోనే బంగారం పుడుతుంది. ఈ సిద్ధాంతం పెద్ద మొత్తంలో బంగారం ఏర్పడటాన్ని వివరించడంలో ఫెయిల్ అయింది. ప్రత్యేకించి ఈ ద్రవాలలో సాధారణంగా బంగారం తక్కువగా ఉండటం కారణంగా ఈ థియరీ ఫెయిల్ అయింది. డాక్టర్ క్రిస్ వోయిసీ నేతృత్వంలోని తాజా అధ్యయనం ప్రకారం.. భూకంపాలు క్వార్ట్జ్ లోపల పైజోఎలెక్ట్రిసిటీని ఉత్పత్తి చేయడం ద్వారా బంగారు నగ్గెట్స్ ఏర్పడటాన్ని ప్రేరేపించగలవని గుర్తించింది. ఈ ప్రక్రియలో యాంత్రిక ఒత్తిడి కారణంగా కొన్ని పదార్థాలలో విద్యుత్ చార్జ్‌ను కలిగిస్తుందని వెల్లడించింది. ఒత్తిడికి గురైన క్వార్ట్జ్ దాని ఉపరితలంపై ఎలెక్ట్రోకెమికల్‌గా బంగారాన్ని నిక్షిప్తం చేయడమే కాకుండా... అది బంగారు నానోపార్టికల్స్‌ను ఏర్పరుస్తుంది. ఈ ప్రక్రియ కొత్త వాటిని ఏర్పరచడం కంటే ఇప్పటికే ఉన్న వాటిపై బంగారం పేరుకుపోవడానికి దారితీస్తుంది. కాలక్రమేణా మరింత బంగారంతో ప్లేటింగ్ చేస్తుంది. దీని ద్వారా అధిక బంగారం నిక్షిప్తం అవుతుంది. ఎలక్ట్రికల్ ఇన్సులేటర్ అయిన క్వార్ట్జ్.. కండక్టర్ అయిన బంగారం.. ఈ ప్రాసెస్ కు సరైన వాతావరణాన్ని సృష్టిస్తాయి. క్వార్ట్జ్ భూకంపం సమయంలో ఒత్తిడిని అనుభవిస్తున్నప్పుడు.. విద్యుత్ చార్జ్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది బంగారు కణాలను ఆకర్షిస్తూ.. ఇప్పటికే ఉన్న స్టోరేజ్ పై మరింత యాడ్ చేస్తుంది. కాలక్రమేణా.. పెద్ద బంగారు నగ్గెట్స్ ఏర్పడటానికి దారితీస్తుంది. ఈ తాజా అధ్యయనం భవిష్యత్తులో బంగారం అన్వేషణ, మైనింగ్‌కు సంబంధించిన అంశాల్లో కీలకంగా మారనుంది.


గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్

గోదావరిలోకి దూకిన కానిస్టేబుల్ ఆరోగ్య సమస్యలే కారణమంటూ దూకడానికి ముందు సెల్ఫీ వీడియో  గల్లంతైన కానిస్టేబుల్ కోసం పోలీసుల గాలింపు భద్రాచలం, వెలుగు : ఆరోగ్య సమస్యలు భరించలేక ఒక కానిస్టేబుల్ భద్రాచలం బ్రిడ్జిపై నుంచి గోదావరిలోకి దూకాడు. ఆయన కోసం గజఈతగాళ్ల సాయంతో నదిలో పోలీసులు గాలిస్తున్నారు. పాల్వంచకు చెందిన కానిస్టేబుల్ రమణారెడ్డి ఆరోగ్య సమస్యలతో ఆ...


CV Anand: రేవంత్ సంచలనం.. హైదరబాద్ సీపీగా మారోసారి సీవీ ఆనంద్..

cv anand : సీఎం రేవంత్ సర్కారు మరోసారి ఐపీఎస్ లను బదిలీ చేసింది. హైదరాబాద్ సీపీగా సీవీ ఆనంద్ కు బాధ్యతలు అప్పగించింది.


జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతి

జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో విషాదం.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతి వినాయక చవితి పండుగ పూట భూపాలపల్లి లో విషాద ఘటన జరిగింది.  పగబట్టిన ప్రకృతి.. పిడుగుపాటుకు మహిళా రైతు మృతిచెందింది. రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేద కుటుంబానికి చెందిన మహిళ రెండుసార్లు పిడుగుపడి ప్రాణాలు కోల్పోయిన ఘటన జయశంకర్​భూపాలపల్లి జిల్లాలో చోటు చేసుకుంది. భూపాలపల్లి మండలంలోని శ...


Leopard In Rajahmundry: రాజమండ్రి శివార్లులో చిరుత సంచారం-భయాందోళనలో ప్రజలు!

East Godavari News: ఏడాదిన్నర కాలం క్రితం కాకినాడ జిల్లాలో పెద్ద పులి సంచారం అక్కడి ప్రజలను కంటిమీద కునుకు లేకుండా చేసింది.. చివరకు అక్కడి నుంచి అనకాపల్లి జిల్లాకు వెళ్లిపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.. ఆరు నెలల క్రితం తూర్పుగోదావరి జిల్లా పరిధిలో కొవ్వూరు మండలం శివారు ప్రాంతాల్లో పెద్దపులి సంచారం చేస్తుందంటూ వార్తలు హల్‌చల్‌ చేశాయి.. ఇదిలా ఉంటే తాజాగా రాజమండ్రి శివారు లాలాచెరువు సమీపంలో దూరదర్శన్‌, ఆల్‌ఇండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో చిరుత...


ప్రభుత్వ ఆస్తులకు నష్టం కలిగించొద్దు

ప్రభుత్వ భూములు, ఆస్తులకు నష్టం కలిగిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని వికారాబాద్‌ కలెక్టర్‌ ప్రతీక్‌ జైన్‌ హెచ్చరించారు. శుక్రవారం ఆయన మండలంలోని పీరంపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో మొక్కలు నాటి..


Rhinoceros: ఇదేక్కడి విడ్డూరం.. సింహాలకు చుక్కలు చూపించిన ఖడ్గమృగాలు.. వీడియో చూస్తే షాక్ అవుతారు..

Lions video: అడవిలో రెండు సింహాలు చెట్లలో ఏంచక్కా కూర్చుని ఉంటాయి. ఇంతలో దూరం నుంచి రెండు బలమైన ఖడ్గమృగాలు అక్కడికి వస్తాయి. వాటిని చూస్తునే సింహాలు రెండు కూడా లేచి పారిపోతాయి.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.


Eluru : వ‌రస‌కు చెల్లిలైన‌ బాలికపై యువ‌కుడు అత్యాచారం.. పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు

Summary: ఏలూరు జిల్లాలో బాలిక‌పై అత్యాచారానికి పాల్ప‌డిన యువ‌కుడి కేసులో.. పోక్సో కోర్టు సంచ‌ల‌న తీర్పు ఇచ్చింది. యువ‌కుడికి జీవితకాల జైలు శిక్షతో పాటు రూ. 5 వేలు జ‌రిమాన విధించింది. బాధితురాలికి న‌ష్ట ప‌రిహారం రూ.3 ల‌క్ష‌ల చెల్లించాల‌ని ఏలూరు పోక్సో కోర్టు తీర్పు ఇచ్చింది.


ఖైరతాబాద్‌ మహాగణపతికి సీఎం రేవంత్‌ తొలి పూజ.. దర్శనానికి పోటెత్తిన భక్తులు

రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఖైరతాబాద్ మహా గణపతికి సీఎం రేవంత్ తొలి పూజ నిర్వహించారు. మహా గణనాథుడి ఆశీస్సులు తీసుకున్నారు. గణపయ్య దయ రాష్ట్రప్రజలపై ఉండాలని ఆకాంక్షించారు.


సష్టమెంత?

ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలు నీటిపాలయ్యాయి. ఇండ్లు కూలిపోయి చాలామంది నిరాశ్రయులయ్యారు. విద్యుత్తు స్తంభాలు నేలకొరిగాయి. రోడ్లూ నామరూపాల్లేకుండా దెబ్బతిన్నాయి. దీంతో నడవలేం..వాహనాలను నడపలేం అన్నట్లుగా పరిస్థితి మారింది.


Tragedy | పండుగపూట విషాదం.. వినాయక మండపంలో విద్యుదాఘాతంతో యువకుడి మృతి

Tragedy | పల్నాడు జిల్లా శావల్యాపురం మండలం పొట్లూరు గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. వినాయక మండపంలో విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందడం కలకలం రేపుతుంది.


అక్కడ గంజాయి సాగుకు ప్రభుత్వం అనుమతి.. ఇక ఎలాంటి అడ్డంకులు లేవు..!

ఇంతకాలం రహస్యంగా, చట్టవిరుద్ధంగా జరుగుతున్న గంజాయి సాగు.. ఇక చట్టబంద్ధం కానుంది. మీరు దీనిని మొదట నమ్మలేకపోవచ్చు.. కానీ ఇది నిజం. భారత దేశంలోని ఒక రాష్ట్రంలో గంజాయి సాగును చట్టబంద్ధం చేస్తున్నారు. వినడానికి ఆశ్చర్యం అనిపించినా ఇందులో ఎలాంటి అబద్ధం లేదు.హిమాచల్ ప్రదేశ్ లో ఇకపై గంజాయిని చట్టబద్ధంగా పండించనున్నారు. ప్రభుత్వ అనుమతితో సాగు ప్రారంభించాలి. గంజాయి సాగు ప్రతిపాదనను రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించారు. రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో గంజాయి...


నాచారం పెయింట్​ కంపెనీలో అగ్నిప్రమాదం

నాచారం పెయింట్​ కంపెనీలో అగ్నిప్రమాదం హైదరాబాద్‌లోని మల్లాపూర్‌ పారిశ్రామిక వాడలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ కంపెనీలో మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది.. వెంటనే ఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. హైదరాబాద్ మల్లాపూర్.. నాచారం  పారిశ్రామిక వాడలో శని...


దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది

దొంగతనం చేస్తుంటే చూశాడని బాలుడిని బండకేసి కొట్టిన ఉన్మాది షాద్ నగర్: పందులు దొంగలించడాన్ని చూశాడని ఆరేళ్ల బాలుడిని ఓ వ్యక్తి హత్య చేశాడు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని హాజీపల్లి రోడ్ లో కొంతమంది జీవనోపాధి కోసం ఎంతో కాలంగా గుడిసెలు వేసుకొని పందుల పెంపకంపై ఆధారపడి ఉన్నారు. అయితే శుక్రవారం రాత్రి సమయంలో ఎల్లయ్య అనే వ్యక్తి పందులను ద...


పల్నాడు: తహశీల్దారుకు రైతు ట్విస్ట్‌, మామూలోడు కాదుగా.. అనుకున్నది సాధించాడు

Ipur Thasildar Office Farmer Protest: పల్నాడు జిల్లా ఈపూరులో ఓ రైతు తహశీల్దారుకు ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. తహసీల్దారు కార్యాలయం ముందు బైఠాయించి పొలంలో సాగు నీటి సదుపాయం ఉన్నట్లుగా బోరు ధ్రువపత్రం సాధించుకున్నాడు. కొద్దిసేపు అక్కడ హైడ్రామా జరగ్గా.. చివరికి పోరాడి అనుకున్న ధ్రువపత్రాన్ని సాధించాడు. అంతేకాదు ఆ రైతు తెలుగు దేశం పార్టీలో కీలకమైన పదవిలో యాక్టివ్‌గా పనిచేస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశం అయ్యింది.


Tenali Crime News: తెనాలి లేడీ సైనైడ్ కిల్లర్స్ చేతిలో చావునుండి జస్ట్ మిస్సయిన ముగ్గురు వీరే

Tenali Cyanide Murders | గుంటూరు పోలీసులు అరెస్టు చేసిన లేడీ కిల్లర్స్ చేసిన హత్యల గురించి వింటుంటే ఒక్కసారిగా వెన్నులో వణుకు పుడుతుంది. తెనాలిలోని యడ్ల లింగయ్య కాలనీ కి చెందిన ముడియాల వేంకటేశ్వరి అలియాస్ బుజ్జి అనే 32 ఏళ్ల మహిళ తన తల్లి రమణమ్మ మరో కొంతమంది తో కలిసి ఒక గ్యాంగ్ లా ఏర్పడి నాలుగు హత్యలు చేశారు. ఇందులో బుజ్జి అత్తగారు సహా వారికి అప్పు ఇచ్చిన మరో వృద్ధురాలు, షేక్ నాగూర్ బీ అనే పక్కింటావిడను బంగారం డబ్బు కోసం కూల్ డ్రింక్ లో సైనైడ్...


బుడమేరులో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గల్లంతు.. అర్ధరాత్రి వరకు రెస్క్యూ

దాదాపు పది రోజులుగా కురిసిన వర్షాలకు రాష్ట్రంలో ప్రజా జీవనం అస్తవ్యస్థమైంది. విజయవాడలో వరద ఇప్పుడిప్పుడే తగ్గి అంతా కుదుట పడుతుందని భావిస్తోన్న తరుణంలో వాతావరణ శాఖ హెచ్చరికలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. మరోసారి బుడమేరు పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం నుంచి భారీ వర్షం కురిసింది. దీంతో మళ్లీ వరద పెరుగుతోంది. భారీ వర్షాలతో గతవారం బుడమేరు ఉగ్రరూపం దాల్చడంతో విజయవాడలోని అనేక ప్రాంతాలు ముంపునకు గురయి ఇంకా వరదలో ఉన్నాయి.


రాజమహేంద్రవరంలో చిరుత కలకలం.. సీసీ కెమెరాలో రికార్డ్, వణికిపోతున్న స్థానికులు

Rajahmundry Leopard Spotted: తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం లాలాచెరువు సమీపంలో చిరుత సంచారం కలకంరేపింది. దూరదర్శన్ కేంద్రానికి సమీపంలో సీసీటీవీ ఫుటేజ్‌లో చిరుత సంచారం రికార్డైంది. వెంటనే రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే చిరుత కోసం ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోగాలింపు మొదలుపెట్టారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతపులి సంచారం గురించి తెలిసి స్థానికంగా కలకలంరేపింది.


Runa Mafi | రుణమాఫీ చెయ్యదు.. రైతు భరోసా ఇవ్వదు.. రైతుల ఉసురుతీస్తున్న కాంగ్రెస్‌ సర్కార్‌

రుణమాఫీ చేయకుండా కాంగ్రెస్‌ ప్రభుత్వం రైతుల ఉసురుతీస్తున్నది. అటు రుణమాఫీ చేయకుండా..ఇటు రైతు భరోసా ఇవ్వకుండా అన్నదాతల ఆత్మహత్యలకు సర్కారే కారణమవుతున్నదని రైతులు ఆరోపిస్తున్నారు.


Krishna River Projects : కృష్ణా ప్రాజెక్టులకు పోటెత్తుతున్న వదర నీరు, పూర్తి స్థాయిలో నీటి మట్టాలు

Krishna River Projects : తెలుగు రాష్ట్రాలతో పాటు ఎగువ రాష్ట్రాల్లో కురుస్తో్న్న వర్షాలతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. కృష్ణనది ప్రాజెక్టులన్నీ నిండు కుండలను తలపిస్తు్న్నాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో నిండాయి. ప్రాజెక్టుల గేట్లు దాదాపుగా తెరిచే ఉంచుతున్నారు.


Budameru Leakage : బుడమేరు మూడో గండి పూడ్చివేత, బండ్ ఎత్తు పెంచే పనులు ప్రారంభం

Budameru Leakage : బుడమేరు గండ్లను విజయవంతంగా పూడ్చివేసినట్లు మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఆర్మీ సాయంలో పెద్దదైన మూడో గండిని శనివారం పూడ్చి వేశారు. ఇటీవల భారీ వర్షాలకు బుడమేరుకు మూడు చోట్ల గండి పడింది. ఈ గండ్ల వలన విజయవాడ ముంపునకు గురైంది.


ముషారఫ్ భూమిని అమ్మేసిన భారత ప్రభుత్వం - పాకిస్తాన్‌లో ఉన్నది కాదు ఇక్కడిదే !

Ex-Pakistan President Parvez Musharraf s land in UP : పాకిస్తాన్ మాజీ మిలటరీ పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు ఇండియాలో ఆస్తులు ఉన్నాయి. వాటిలో ఉన్న ఒక ఆస్తిని ప్రభుత్వం వేలం వేసేసింది. యూపీలోని కొటానా అనే గ్రామంలో ఉన్న రెండు హెక్టార్ల భూమిని రూ. కోటి ముఫ్పై ఎనిమిది లక్షలకు వేలం పాటలో ఇతర వ్యక్తులు దక్కించుకున్నారు. రిజిస్ట్రేషన్ తో కలిపి కోటిన్నర అవుతుంది. దేశ విభజన సమయంలో పాకిస్థాన్ వెళ్లిపోయిన ముషారఫ్ కుటుంబం పాకిస్తాన్ మిలటరీ చీఫ్ గా కూడా పని చేసిన...


వినాయకచవితి రోజున విఘ్నేశ్వరుడికి జనసేనాని పూజలు

వినాయకచవితి సందర్భంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక పూజలు చేశారు. మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో వినాయక చవితి పూజలు సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మట్టి గణపతి ప్రతిమకు పవన్ కళ్యాణ్ పూజలు చేశారు. విఘ్నాలు లేకుండా రాష్ట్రాభివృద్ధికి దైవం ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. విఘ్నేశ్వరుడి కరుణాకటాక్షాలతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో గడపాలని, విజయాలు సిద్ధించాలని అభిలషించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శాసనమండలి సభ్యులు పిడుగు హరిప్రసాద్ సహా ఇతర నేతలు పాల్గొన్నారు. అనంతరం కలెక్టరేట్ ప్రాంగణంలో ఏర్పాటుచేసిన వినాయకుడికి పవన్ కళ్యాణ్ పూజలు చేశారు.


Drugs | పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసుల దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స్‌ (Drugs) కలకలం రేపాయి. నగరంలోని పలు పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా డ్రగ్స్‌ తీసుకున్న నలుగురు పట్టుబడ్డారు. శేరిలింగంపల్లి, జూబ్లీహిల్స్‌లో ఉన్న కోరం క్లబ్‌, బేజీలోన్‌ పబ్‌తోపాటు మరో మూడు పబ్బుల్లో అధికారులు తనిఖీలు నిర్వహించారు.


Leopard: రాజమహేంద్రవరం శివారులో చిరుత సంచారం - ప్రజలకు అధికారుల హెచ్చరిక, ఈ నెంబరుకు కాల్ చేయండి!

Leopard In Rajamahendravaram: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో చిరుత సంచారం ఆందోళన కలిగిస్తోంది. రాజమండ్రి శివారు లాలాచెరువు సమీపంలోని దూరదర్శన్‌, ఆలిండియా రేడియో రిలే స్టేషన్‌ ప్రాంగణంలో పులి సంచరిస్తున్న దృశ్యాలు అక్కడి సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. శుక్రవారం రాత్రి ఒంటి గంట సమయంలో పంది వెనుక మాటు వేసి వెళ్తూ దానిపై దాడికి పాల్పడిన దృశ్యాలను బమ్మూరు పోలీసులకు దూరదర్శన్‌ సిబ్బంది అందజేశారు. ఈ క్రమంలో అప్రమత్తమైన అటవీ అధికారులు చిరుత కదలికలు...


Khammam Rains : భారీ వర్షాలు - మున్నేరుకు మళ్లీ పెరుగుతున్న వరద ఉద్ధృతి, ఖమ్మం జిల్లాకు రెడ్ అలర్ట్..!

ఖమ్మం జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటంతో మున్నేరు వాగు మరోసారి పొంగి పొర్లే అవకాశం ఉంది. దీంతో అప్రమత్తమైన అధికారులు హెచ్చరికలను జారీ చేశారు. లోతట్టు ప్రాంత వాసులను ఖాళీ చేయిస్తున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


Raja Singh: గణేష్ చతుర్థి.. హలాల్ విముక్తి.. రాజాసింగ్ కొత్త నినాదం..


Basara IIIT Students : 'రెగ్యూలర్ వీసీని నియమించండి' - బాసర ట్రిపుల్ఐటీ విద్యార్థుల ఆందోళన

బాసర ఐఐఐటీ విద్యార్థులు మరోసారి ఆందోళనబాట పట్టారు. ఇంఛార్జ్ వీసీని తొలగించి… రెగ్యూలర్ వీసీని నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. క్యాంపస్ లో నెలకొన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతున్నారు. నాలుగు రోజులుగా విద్యార్థుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. మరోవైపు అధికారులు క్యాంపస్ లో ఆంక్షలు విధించారు.


రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు.

రోడ్డు పక్కనే చెత్త పారేసినట్లుగా పసిబిడ్డను పారేశారు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం తిమ్మాపూర్ గ్రామంలో దారుణం జరిగింది.. కొంతమంది దుర్మాఅప్పుడే పుట్టిన మగ శిశువును చెత్తలో పడవేశారు.. శిశువు అరుపులు విని  గమనించిన స్థానికులు...  సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అమ్మ కడుపులోంచి బైటపడి ఇంకా లోకం వంక కన్నెత్తైనా చూడనేలేదు. అమ్మ పేగు తెంచుకుని పుట్టిన...


వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి

వినాయక మండపంలో కరెంట్ షాక్​తో యువకుడు మృతి జీడిమెట్ల :  వినాయక మండపం ఏర్పాటు చేస్తుండగా కరెంట్ షాక్ తో ఓ యువకుడు చనిపోగా.. మరొకరికి గాయాలయ్యాయి. పేట్​బషీరాబాద్ పీఎస్​ పరిధిలోని దూలపల్లికి చెందిన నవీన్​చారి(28) బస్సు బాడీ లేబర్  పనిచేస్తుంటాడు. శుక్రవారం రాత్రి వినాయక మండపం కోసం ఏర్పాట్లు చేస్తున్నాడు. మండపం పై నుంచి వర్షం నీరు కిందికి రాకుండా టార్ప...


పితృ పక్షం ముందు ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని అర్థం..!

సనాతన ధర్మంలో పితృపక్షానికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ క్యాలెండర్ ప్రకారం ఈ సంవత్సరం పితృ పక్షం సెప్టెంబర్ 17.. మంగళవారం ప్రారంభమై అక్టోబర్ 2న ముగుస్తుంది. పూర్ణిమ తిథి పితృపక్షం ప్రారంభాన్ని సూచిస్తుంది.. అమావాస్య తిథి ముగింపును సూచిస్తుంది. పితృపక్షంలో ప్రజలు తమ పూర్వీకుల కోసం శ్రాద్ధం, తర్పణాలు చేస్తారు, అయితే మీ ఇంట్లో పూర్వీకులు మీ పై కోపంగా ఉన్నారో లేదో తెలుసుకోడానికి కొన్ని సంకేతాలు ఉన్నాయి ఈరోజు మనం అవేంటో తెలుసుకుందాం.అయోధ్య...


ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు

ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ గేట్లు ఎత్తారు హైదరాబాద్:ఎగువ నుంచి వస్తున్న వరద నీటితో జంట శలాశయాలైన ఉస్మాన్ సాగర్( గండిపేట), హిమాయత్ సాగర్ రిజర్వాయర్లు పూర్తిగా నిండిపోయాయి.. నిండు కుండను తలపిస్తున్నాయి. శనివారం (సెప్టెంబర్ 7, 23024) సాయంత్రం హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రిజర్వాయర్ల  గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు అధికారులు. ప్రత్యేక పూజల...


వరద విలయం నుంచి తేరుకుంటున్న విజయవాడ ఇప్పుడు ఎలా ఉందో చూపే కొన్ని చిత్రాలు..

విజయవాడలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. నిత్యావసర సరుకుల పంపిణీ జరుగుతోంది.


తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు

తెలంగాణలో 29 వరద ప్రభావిత జిల్లాలు వరదలతో  ఇప్పటివరకు 29 మంది మృతి  సహాయ, పునరావాస చర్యలపై ఎల్లుండి హైలెవల్​ మీటింగ్ హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలతో 29 జిల్లాలను వరద బాధిత జిల్లాలుగా ప్రకటిస్తున్నట్టు సీఎస్​ శాంతి కుమారి తెలిపారు. ఇప్పటికే 4 జిల్లాలను వరద ప్రభావిత జిల్లాలుగా ప్రకటించి, తగిన సహాయ, పునరావాస చర్యలు చ...


Kargil War: అవును, కార్గిల్ యుద్ధం చేసింది మేమే.. ఎట్టకేలకు పాతికేళ్లకు ఒప్పుకున్న పాక్

Kargil War: భారత్, పాక్ మధ్య కార్గిల్ యుద్ధం జరిగి ఇటీవలె 25 ఏళ్లు పూర్తయింది. భారత భూభాగాన్ని ఆక్రమించుకోవాలని దాయాది పాక్ చేసిన ప్రయత్నాన్ని.. ఇండియన్ ఆర్మీ గట్టిగా తిప్పికొట్టింది. అయితే ఈ ఘటన జరిగి పాతికేళ్లు పూర్తయినా ఇప్పటివరకు.. కార్గిల్ యుద్ధం చేసింది తామే అని ఇప్పటివరకు పాకిస్తాన్ అంగీకరించలేదు. కానీ తాజాగా పాక్ ఆర్మీ చీఫ్ స్వయంగా.. ఒప్పుకోవడంతో ఇన్నేళ్లపాటు దాగుడుమూతలు ఆడిన పాక్ బాగోతం బయటపడింది. ఇంతకీ ఏం జరిగిందంటే?