ENCOUNTER | జమ్మూ కశ్మీర్‌లో మరోసారి ఎదురుకాల్పులు.. జవాను మృతి..!

Encounter | జమ్మూ కశ్మీర్‌ (Jammu And Kashmir) లో మరోసారి ఎన్‌కౌంటర్‌ (Encounte) చోటు చేసుకుంది. కుప్వారా (Kupwara) జిల్లాలో నియంత్ర రేఖ వెంబడి (Line of Control) పాకిస్థాన్‌ బోర్డర్‌ యాక్షన్‌ టీమ్‌ జరిపిన దాడిని మన సైన్యం (Indian Army) భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నారు. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా.. ఆర్మీ మేజర్‌ సహా నలుగురు గాయపడ్డారు. ఈ ఆపరేషన్‌లో ఓ పాకిస్థానీ ఉగ్రవాదిని మన సైన్యం మట్టుబెట్టింది.

శనివారం తెల్లవారుజామున మచల్ సెక్టార్‌లోని కుంకడి ఫార్వర్డ్ పోస్ట్‌ వైపు వెళ్తున్నవారిని భద్రతా దళాలు పసిగట్టాయి. దీంతో వారిని ప్రశ్నించేలోపే.. పాక్ ఆర్మీకి చెందిన బ్యాట్ (Pakistan Border Action Team) స్క్వాడ్ కాల్పులు జరిపి వెనక్కి పరుగులు తీసింది. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా దళాలు ఎదురుకాల్పులు జరిపాయి. దాదాపు మూడు గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనలో ఆర్మీ మేజర్‌ సహా నలుగురు భారత సైనికులు తీవ్రంగా గాయపడినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఘటనలో భారత ఆర్మీకి చెందిన ఓ జవాను కూడా ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిసింది. ఈ ఆపరేషన్‌లో పాకిస్థాన్‌కు చెందిన ఉగ్రవాదిగా అనుమానిస్తున్న వ్యక్తి కూడా మరణించినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఆపరేషన్‌ కొనసాగుతోంది.

Also Read..

Kamala Harris | అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా కమలా హారిస్‌ పేరు ఖరారు.. అధికారికంగా ప్రకటన

Bengaluru Murder: బెంగుళూరు హాస్ట‌ల్‌లో బీహారీ అమ్మాయి మ‌ర్డ‌ర్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో నిందితుడి అరెస్టు

Samantha | సమంతా సిటాడెల్‌కు డేట్‌ కన్‌ఫర్మ్ అయ్యిందా?

2024-07-27T05:35:41Z dg43tfdfdgfd