MMTS TRAIN | ఎంఎంటీఎస్‌ రైల్లోంచి జారిపడి యువకుడి మృతి

కాచిగూడ,జూన్‌ 11: ప్రమాదవశాత్తు రైల్లోంచి(MMTS train) జారిపడి ఓ యువకుడు(Youth died) మృతి చెందాడు. ఈ సంఘటన కాచిగూడ రైల్వే పోలీస్‌స్టేషన్‌ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్‌ ఎల్లప్ప తెలిపిన వివరాల ప్రకారం సికింద్రాబాద్‌లోని బోయిగూడ ప్రాంతానికి చెందిన హరినాథ్‌ కుమారుడు జనసూర్య (20)ఇంటర్మీడియట్‌ వరకు చదువుకున్నాడు.

ఫలక్‌నామ నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి ఎంఎంటీఎస్‌ రైల్లో ప్రయాణిస్తుండగా యాకత్‌పుర రైల్వేస్టేషన్‌ సమీపంలో ప్రమాదవశాత్తు రైల్లోంచి జారిపడి జనసూర్య అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న హెడ్‌కానిస్టేబుల్‌ చిమ్నానాయక్‌ సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా దవాఖానకు తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.

2024-06-11T12:57:00Z dg43tfdfdgfd