జూలై 29న ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ ధర్నా

జూలై 29న ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ ధర్నా

హైదరాబాద్, వెలుగు: మహిళలకు మోదీ సర్కార్ ఆర్థిక చేయూతనివ్వాలని మహిళా కాం గ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు సునీతా రావు డిమాండ్ చేశారు. మహిళల రక్షణ కోసం బిల్లులు పాస్ చేసినా వాటిని ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు. దీనిపై ఈ నెల 29న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా చేయనున్నట్లు వెల్లడించారు. శుక్రవారం ఆమె గాంధీ భవన్​లో మీడియాతో మాట్లాడా రు.

దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, వారికి న్యాయం జరిగే వరకు రాష్ట్ర మహిళా కాంగ్రెస్ పోరాడుతుందని చెప్పారు. ఢిల్లీలో చేపట్టే ఆందోళనకు రాష్ట్రంలోని మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని సునీతా రావు పిలుపునిచ్చారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-27T03:20:52Z dg43tfdfdgfd