జడ్జి చొరవతో అనాథ పిల్లలకు ఆధార్ కార్డులు

జడ్జి చొరవతో అనాథ పిల్లలకు ఆధార్ కార్డులు

శివ్వంపేట, వెలుగు : మండలంలోని మగ్దుంపూర్ లోని బేతాని సంరక్షణ అనాథ ఆశ్రమంలో ఉన్న 30 మంది పిల్లలకు ఆధార్ కార్డులు లేవు. దీంతో వారికి పింఛన్, రేషన్​రావడం లేదు. ఈ విషయం నర్సాపూర్ కోర్టు జడ్జి అనిత దృష్టికి వెళ్లడంతో ఆమె స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని తహసీల్దార్​శ్రీనివాస్ చారిని ఆదేశించారు. ఈ మేరకు మండల పరిధిలోని మాదాపూర్ ఆధార్ సెంటర్ ఇన్​చార్జితో మాట్లాడి శుక్రవారం స్పెషల్​  క్యాంప్​ ఏర్పాటు చేశారు.

అనాథాశ్రమంలోని 22 మంది అనాథ దివ్యాంగులు, మతి స్థిమితం లేని వారిని ఆధార్​సెంటర్​కు తీసుకెళ్లి  ఫొటోలు తీసుకుని, వివరాలు  నమోదు చేశారు. కార్యక్రమంలో జీపీ సెక్రటరీ చంద్రశేఖర్, ఆధార్ రీజినల్ మేనేజర్ భవాని ప్రసాద్, అసిస్టెంట్ మేనేజర్ సంతోష్ సింగ్, ఆశ్రమం నిర్వాకుడు సజీవ వర్గీస్, సోషల్ సర్వీస్ ఇన్​చార్జి వీరబాబు పాల్గొన్నారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-27T05:06:09Z dg43tfdfdgfd