ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి

ఫోన్​ చార్జింగ్​ పెడుతుండగా కరెంట్​షాక్​తో బాలిక మృతి

మధిర, వెలుగు: ఖమ్మం జిల్లా చింతకాని మండలం నామారంలో శుక్రవారం సెల్​ఫోన్​చార్జింగ్​పెడుతుండగా షాక్​కొట్టడంతో ఓ బాలిక చనిపోయింది. గ్రామానికి చెందిన కనికాల రామకృష్ణ తన సెల్​ఫోన్​చార్జింగ్​ పెట్టమని కూతురు అంజలీ కార్తీక(8)కు ​ఇచ్చాడు. ఆమె వెళ్లి ఇంట్లో కరెంట్ బోర్డు వద్ద చార్జింగ్​పెడుతుండగా షాక్​ కొట్టి అక్కడిక్కడే చనిపోయింది. అంజలీ కార్తీక 4వ తరగతి చదువుతోంది. చింతకాని ఎస్సై నాగుల్​మీరా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-27T03:05:50Z dg43tfdfdgfd