మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్

మహావీర్ ​ఇంజినీరింగ్ కాలేజీలో ర్యాగింగ్

  •     బాత్రూమ్​లో జూనియర్లపై సీనియర్ల దాడి
  •     ఇద్దరు స్టూడెంట్లకు గాయాలు.. కేసు నమోదు

శంషాబాద్, వెలుగు : రాజేంద్రనగర్​ నియోజకవర్గంలోని మహావీర్ ఇంజినీరింగ్ కాలేజీలో సీనియర్ ​స్టూడెంట్లు రెచ్చిపోయారు. ర్యాగింగ్​ పేరుతో జూనియర్ స్టూడెంట్లపై దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో మైలార్ దేవ్ పల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈ నెల 23న కాలేజీలో సెమినార్ ​నిర్వహించారు. ఆ కార్యక్రమానికి స్టూడెంట్లంతా హాజరయ్యారు. అయితే ‘సెమినార్​కు పిలిచి సీనియర్లతో ఎలా బిహేవ్​ చేయాలో తెలియాదా?

ఫస్ట్ ​సీనియర్లతో ఎలా మాట్లాడాలో నేర్చుకోండి’ అంటూ కొందరు సీనియర్ ​స్టూడెంట్లు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఇద్దరిని కాలేజీ బాత్రూమ్​లో బంధించి, పిడి గుద్దులు కురిపించారు. గాయపడిన ఇద్దరు స్టూడెంట్లు మైలార్​దేవ్ పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఐదుగురు స్టూడెంట్లపై పీటీ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

©️ VIL Media Pvt Ltd.

2024-07-27T03:20:52Z dg43tfdfdgfd