యాదగిరిగుట్టలో నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు

యాదగిరిగుట్టలో నేటి నుంచి అందుబాటులోకి రానున్న ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు

యాదగిరిగుట్ట, వెలుగు : యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలో జూనియర్ సివిల్ జడ్జి, ఫస్ట్ క్లాస్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. ఈ కోర్టు భవనాన్ని శనివారం హైకోర్టు జడ్జి, జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ ఈవీ వేణుగోపాల్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు జడ్జిలు జస్టిస్ టి.వినోద్ కుమార్, కె.లక్ష్మణ్, కె.సుజన పాల్గొననున్నారు.

ఇందుకోసం జిల్లా ఆఫీసర్లు యాదగిరిగుట్టలోని తులసీ కాటేజీ ప్రాంగణంలో అద్దె ప్రాతిపదికన కోర్టు బిల్డింగ్ ను సిద్ధం చేశారు. యాదగిరిగుట్ట, రాజాపేట మండలాలకు చెందిన సివిల్, క్రిమినల్ కేసులు ఈ కోర్టు పరిధిలోకి రానున్నాయి. యాదగిరిగుట్టలో కొత్తగా అందుబాటులోకి రానున్న కోర్టుకు తాత్కాలిక న్యాయమూర్తిగా ఆలేరు జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జస్టిస్ నూర సుమలత వ్యవహరించనున్నారు. యాదగిరిగుట్టలో కోర్టు అందుబాటులోకి వచ్చిన నెలలోపు పర్మనెంట్ జడ్జిని ప్రభుత్వం నియమించనుంది. 

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-27T05:36:16Z dg43tfdfdgfd