MUMBAI | రౌడీషీటర్‌ హత్య.. శరీరంపై టాటూతో శత్రువుల పేర్లు

  • నిందితులను అరెస్ట్‌ చేసిన పోలీసులు

Mumbai | ముంబై, జూలై 26: తాను హత్యకు గురైనా తన శత్రువులు చట్టం నుంచి తప్పించుకోకూడదని భావించిన ఒక రౌడీ షీటర్‌ తన ఒంటిపై 22 మంది శత్రువుల పేర్లు పచ్చబొట్టుతో రాయించుకున్నాడు. తనూహించిన విధంగానే అతడిని కొందరు బుధవారం హత్య చేశారు. అయితే అతను తన శరీరంపై రాసుకున్న శత్రువుల పేర్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను పట్టుకున్నారు. 48 ఏండ్ల గురు వాఘ్‌మరె అనే రౌడీషీటర్‌ను ముంబై వర్లీ సమీపంలోని ఒక స్పాలో బుధవారం కొందరు పొడిచి చంపారు.

దీంతో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు హతుడి శరీరంపై పచ్చబొట్టుతో ఉన్న 22 పేర్లను పరిశీలించారు. దీంతో స్పా యజమానే అతడిని హత్య చేసినట్టు నిర్థారించి అతడితో పాటు, మరికొంత మందిని అరెస్ట్‌ చేశారు. హతుడు స్పా యజమానులను బెదిరించి డబ్బులు వసూలు చేసేవాడని, అందుకే అతడిని స్పా యజమాని సుపారీ ఇచ్చి హతమార్చాడని పోలీసులు తెలిపారు.

2024-07-26T22:04:25Z dg43tfdfdgfd