వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడలో పోచమ్మకు బోనాలు

వేములవాడ​, వెలుగు: వేములవాడ శ్రీరాజరాజేశ్వరస్వామివారి ఆలయ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం పోచమ్మకు బోనాలతో మొక్కులు చెల్లించారు. ఆషాఢం సందర్భంగా టీఎన్​జీవో ఆధ్వర్యంలో అమ్మవారికి పోతరాజు, శివపార్వతులు నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లి బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించారు.కార్యక్రమంలో సిరిసిరి శ్రీరాములు, మూర్తి, చంద్రశేఖర్​, కూరగాయల శ్రీనివాస్​, హరిహరనాథ్​, ఉద్యోగులు, అర్చకులు పాల్గొన్నారు. 

కోటి నవదుర్గమ్మకు బోనాలు 

కోరుట్ల, వెలుగు: కోరుట్లలోని శివ మార్కండేయ, కోటి నవదుర్గ ఆలయంలో శుక్రవారం ఆషాడ బోనాల జాతర నిర్వహించారు. మహిళలు నెత్తిన బోనాలను పెట్టుకుని డప్పు చప్పుళ్ల మధ్య ప్రధాన వీధుల గుండా ఆలయం వరకు ఊరేగింపుగా చేరుకున్నారు. కాంగ్రెస్​ నియోజకవర్గ ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చార్జి జువ్వాడి నర్సింగరావు బోనం ఎత్తుకుని ఉత్సాహాపరిచారు.

అనంతరం జువ్వాడిని పద్మశాలీ సంఘం నాయకులు శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో  పద్మశాలీ సంఘం జిల్లా అధ్యక్షుడు రుద్ర శ్రీనివాస్​, కౌన్సిలర్లు ​ఎంబేరి నాగభూషణం, ఆడెపు కమల, జిందం లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్ , మహిళా అధ్యక్షురాలు కవిత పాల్గొన్నారు.

  ©️ VIL Media Pvt Ltd.

2024-07-27T05:21:11Z dg43tfdfdgfd