సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

సింగరేణి ఉద్యోగుల ఆరోగ్యానికి ప్రాధాన్యత

  •     సింగరేణి డిస్పెన్సరీలో ఆక్యుపేషనల్​హెల్త్ ​సర్వీస్ ​సెంటర్​ ప్రారంభం

నస్పూర్, వెలుగు : శ్రీరాంపూర్​ ఏరియా నస్పూర్​సింగరేణి డిస్పెన్సరీలో రూ.15 లక్షలతో ఆధునీకరించిన ఆక్యుపేషనల్ ​హెల్త్​సర్వీస్​ సెంటర్​ను సింగరేణి కార్పొరేట్​ జీఎం గురువయ్య, శ్రీరాంపూర్​ఏరియా జీఎం బి.సంజీవరెడ్డి శుక్రవారం ప్రారంభించారు. సింగరేణి ఉద్యోగులు, వారి కుటుంబసభ్యుల ఆరోగ్యానికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

కార్యక్రమంలో సింగరేణి చీఫ్​ మెడికల్​ఆఫీసర్ ​డాక్టర్​సుజాత, బెల్లంపల్లి రీజియన్ సేఫ్టీ జీఎం రఘుకుమార్, సింగరేణి గుర్తింపు సంఘం ఏఐటీయూసీ బ్రాంచి సెక్రటరీ బాజీసైదా, సింగరేణి అధికారుల సంఘం ప్రెసిడెంట్​ వెంకటేశ్వర్​రెడ్డి, డీజీఎం పర్సనల్​పి.అరవిందరావు, డీజీఎం ఆనంద్​కుమార్, డాక్టర్లు పాల్గొన్నారు. 

సెక్యూరిటీ గార్డులకు జీరో శాలరీ అకౌంట్ల అందజేత

శ్రీరాంపూర్​ఏరియా సింగరేణి ఎస్​ఆండ్​పీసీ విభాగంలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులకు శుక్రవారం ఏరియా జీఎం సంజీవరెడ్డి హెచ్ డీఎఫ్​బ్యాంకు కార్పొరేట్​ జీవో శాలరీ అకౌంట్లు అందజేశారు. ఇన్​చార్జి ఏస్వోటు జీఎం గోపాల్​సింగ్, సెక్యురిటీ ఆఫీసర్​ మురళీమోహన్​ పాల్గొన్నారు. 

©️ VIL Media Pvt Ltd.

2024-07-27T05:06:09Z dg43tfdfdgfd