గుంటూరు: ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా పెదకాకాని వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. మంగళవారం తెల్లవారుజామున జాతీయ రహదారిపై లారీ-కారు-టాటా ఏస్ వాహనం ఢీకొన్నాయి. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. మరో 15 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు.
విజయవాడ నుంచి గుంటూరు వైపు వెళ్తున్న సిమెంట్ రెడీమిక్స్ వాహనం.. పెదకాకానిలోని అమెరికన్ అంకాలజీ క్యాన్సర్ దవాఖాన వద్ద చెడిపోయింది. దీంతో డ్రైవర్ దానిని రోడ్డుకు కుడివైపున నిలిపాడు. అయిదే దానిని గమనించకుండా వెనుక నుంచి వచ్చిన కారు ఢీకొట్టింది. దీంతో రెడీమిక్స్ వాహనం రోడ్డు మధ్యకు జరిగింది. అదే సమయంలో వెనుక నుంచి కూలీలతో వస్తున్న టాటాఏస్ మినీ ట్రక్ దానిని ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. మృతులను కే.రాంబాబు, తేజ, మధుగా గుర్తించామన్నారు. వీరంతా డెకరేషన్ పనుకు వెళ్లివస్తున్న కూలీలని చెప్పారు. గాయపడిన వారిని జీజీహెచ్కు తరలించామన్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
2024-06-11T04:59:56Z dg43tfdfdgfd