అమరావతి : వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ఒంటిమిట్ట మండలం ఇబ్రహీం పేట గ్రామంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇద్దరు మృతి చెందారు. సోమవారం రాత్రి షార్ట్ సర్క్యూట్ కారణంగా గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది . గంగమ్మ(68) అనే వృద్ధురాలు ఇంటిలోని ఫ్రిడ్జ్ను తెరిచిన సమయంలో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే చనిపోగా ఆమెను కాపాడబోయిన పొరుగున ఉన్న కొండయ్య (55)అనే వ్యక్తి తీవ్ర గాయాలపాలయ్యాడు.
అతడిని హుటాహుటినా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో చనిపోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని శవ పంచనామా నిర్వహించారు. మృతదేహాలను ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
2024-06-11T10:30:42Z dg43tfdfdgfd