ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా మోహన్ చరణ్ మాఝీ

ఒడిశా కొత్త ముఖ్యమంత్రిగా గిరిజన నేత  మోహన్ చరణ్ మాఝీ ఎంపికయ్యారు. డిప్యూటీ సీఎంలుగా  రు - కేవీ సింగ్ డియో, ప్రవతి పరిదా లకు అవకాశం లభించింది.  మాఝీని బీజేపీ శాసనసభా పక్ష నేతగా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.  మోహన్ మాఝీ కియోంజర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎంపికయ్యారు. వీరు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.  

ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ , బీజేపీ అగ్రనేతలు, పార్టీ ముఖ్యమంత్రులు హాజరుకానున్నారు. కాగా ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 147 స్థానాలకు గాను 78 సీట్లు గెలుచుకుని తొలిసారిగా రాష్ట్రంలో బీజేపీ సొంతంగా అధికారంలోకి వచ్చింది.  2000, 2004లో బీజేడీ కూటమి భాగస్వామిగా బీజేపీ రాష్ట్రాన్ని పాలించింది

  ©️ VIL Media Pvt Ltd.

2024-06-11T13:06:46Z dg43tfdfdgfd