AP EAMCET ఫలితాలు విడుదల.. ర్యాంక్ కార్డ్‌ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి

ఆంధ్రప్రదేశ్‌ ఈఏపీసెట్‌ ఫలితాలు (AP EAPCET 2024 Results) విడుదలయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్‌ఛార్జి ఛైర్మన్‌ రామమోహన్‌రావుతో కలిసి EAMCET ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను చూడటానికి, ర్యాంక్ కార్డ్‌ డౌన్‌లోడ్ చేసుకోవానికి ఈ లింక్ క్లిక్ చేయండి.

ఈ ఏడాది ఈఏపీసెట్‌ 2024 పరీక్షను జేఎన్‌టీయూ- కాకినాడ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. 3,39,139 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్‌ విభాగంలో 2,58,373 మంది.. అదేవిధంగా వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు.

2024-06-11T11:58:06Z dg43tfdfdgfd