ఆంధ్రప్రదేశ్ ఈఏపీసెట్ ఫలితాలు (AP EAPCET 2024 Results) విడుదలయ్యాయి. ఉన్నత విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, ఉన్నత విద్యామండలి ఇన్ఛార్జి ఛైర్మన్ రామమోహన్రావుతో కలిసి EAMCET ఫలితాలను విడుదల చేశారు. ఫలితాలను చూడటానికి, ర్యాంక్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవానికి ఈ లింక్ క్లిక్ చేయండి.
ఈ ఏడాది ఈఏపీసెట్ 2024 పరీక్షను జేఎన్టీయూ- కాకినాడ నిర్వహించింది. ఈ పరీక్షకు మొత్తం 3,62,851 మంది దరఖాస్తు చేయగా.. 3,39,139 మంది హాజరయ్యారు. ఇంజినీరింగ్ విభాగంలో 2,58,373 మంది.. అదేవిధంగా వ్యవసాయ, ఫార్మసీ విభాగాలకు కలిపి 80,766 మంది పరీక్షలు రాశారు.
2024-06-11T11:58:06Z dg43tfdfdgfd